ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తున్నారా.. ఇక నుంచి ‘చిల్లర’ గొడవలకు ఎండ్..!

ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తున్నారా.. ఇక నుంచి ‘చిల్లర’ గొడవలకు ఎండ్..!

ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్ న్యూస్. ఇక నుంచి చిల్లర గొడవలు లేకుండా గుడ్ న్యూస్ చెప్పింది ఆర్టీసీ సంస్థ. ముఖ్యంగా సిటీ బస్సుల్లో తిరిగి ప్రయాణికుల కోసం కొత్త సదుపాయాన్ని తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. చేతిలో చిల్లి గవ్వ లేకున్నా కూడా ఇక నుంచి ఆర్టీసీ బస్సుల్లో తిరగొచ్చు. అంతే కాకుండా చిల్లర లేదని మధ్యలో బస్సు నుంచి దింపే పరిస్థితి కూడా ఇక నుంచి ఉండదు. 

సిటీ ఆర్టీసీ బస్సుల్లోఆన్లైన్ టికెటింగ్ విధానాన్ని తీసుకొస్తున్నట్లు ఆర్టీసీ ప్రకటించింది. ప్యాసింజర్లకు, కండక్టర్లకు మధ్య చిల్లర గొడవలకు స్వస్తి పలికేందుకు నిర్ణయం తీసుకుంది. సిటీ బస్సుల్లో క్యూ ఆర్ కోడ్ స్కానింగ్ తో ప్రయాణం చేయవచ్చునని తాజా ప్రకటనలో తెలిపింది.

ఇక నుంచి యూపీఐ పేమెంట్స్ ద్వారా ఆర్టీసీ బస్సుల్లో టికెట్ తీసుకునే వెసులుబాటు కల్పిస్తున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఆటోమేటిక్ ఫేర్ కలెక్షన్ సిస్టంలో భాగంగా ఆన్లైన్ టికెటింగ్ తీసుకొచ్చిన తెలిపారు. త్వరలోనే మరిన్ని ఆన్లైన్ సేవలు అందుబాటులోకీ వస్తాయనీ అధికారులు తెలిపారు.