అక్టోబర్ 3 నుంచి  ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షలు

అక్టోబర్ 3 నుంచి  ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షలు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో వచ్చే నెల 3 నుంచి తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ (టాస్) ద్వారా నిర్వహించే టెన్త్, ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. అందుకు సంబంధించిన పరీక్షల షెడ్యూల్​ను టాస్ డైరెక్టర్ పీవీ. శ్రీహరి, జాయింట్ డైరెక్టర్ సోమిరెడ్డి రిలీజ్ చేశారు. అక్టోబర్ 3 నుంచి 9 వరకూ పరీక్షలు నిర్వహించనున్నట్టు వారు తెలిపారు. మార్నింగ్ సెషన్ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, ఆఫ్టర్ నూన్ సెషన్ మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు కొనసాగుతుందని చెప్పారు. ఈ పరీక్షలకు 22వేల మందికి పైగా అభ్యర్థులు అటెండ్ కానున్నారని పేర్కొన్నారు. అక్టోబర్16 నుంచి 23 వరకు ప్రాక్టికల్స్ ఉంటాయని వెల్లడించారు. పరీక్షలను పకడ్బందీగా నిర్వహిచేందుకు  అన్ని ఏర్పాట్లు చేసినట్టు వివరించారు.