బ్రిక్ అండ్​ బోల్ట్ ఎక్స్​పీరియెన్స్​సెంటర్​ ప్రారంభం

బ్రిక్ అండ్​ బోల్ట్ ఎక్స్​పీరియెన్స్​సెంటర్​ ప్రారంభం

హైదరాబాద్, వెలుగు: టెక్నాలజీ ఆధారిత నిర్మాణ రంగ కంపెనీ బ్రిక్ అండ్​బోల్ట్, హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో తమ సరికొత్త ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పీరియన్స్ సెంటర్ (ఈసీ)ని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది.  మాదాపూర్​లోని జూబ్లీ ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌క్లేవ్​లో దీనిని ఏర్పాటు చేశారు.

ఈ ఆధునిక సదుపాయం దేశంలోని ఇంటి యజమానుల కోసం సేవలను అందిస్తుంది. దాదాపు 2,376 చదరపు అడుగుల విస్తీర్ణంలో దీనిని నిర్మించారు. తమ దగ్గర బేసిక్, క్లాసిక్, ప్రీమియం, రాయల్,  దాలియా ప్యాకేజీలు ఉన్నాయని తెలిపింది.

 గృహ,  వాణిజ్య నిర్మాణ పరిష్కారాల కోసం నిపుణులైన సాంకేతిక సలహాదారులను కూడా ఇక్కడ సంప్రదించవచ్చని బ్రిక్​అండ్​బోల్ట్​ తెలిపింది.