ఇబ్రహీంపట్నం, వెలుగు: జనవరి 1 నుంచి 31 వరకు ఆపరేషన్ స్మైల్లో భాగంగా 80 మంది బాలకార్మికులకు పోలీసులు విముక్తి కల్పించారు. ఇబ్రహీంపట్నం, మంచాల, యాచారం, ఆదిబట్ల, మాడ్గుల, గ్రీన్ ఫార్మాసిటీ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఒక ఆపరేషన్ స్మైల్ ప్రత్యేక టీం ఏర్పాటు చేశారు.
ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలో ప్రత్యేక టీం 50 మందిని, పోలీసులు 30 మంది బాలకార్మికులను గుర్తించారు. బాల కార్మికులతో పనులు చేయిస్తున్న వారిపై 70కి పైగా కేసులు నమోదు చేశారు. బాలకార్మికులతో ఎక్కడైనా పనులు చేయిస్తే చైల్డ్ ప్రొటెక్షన్ సొసైటీని సంప్రదించాలని ఆ సంఘం ప్రతినిధి ప్రవీణ్కుమార్ కోరారు.