![ఉప్పల్లో నకిలీ గోల్డ్ పెట్టి ఒరిజనల్ గోల్డ్ చోరీ](https://static.v6velugu.com/uploads/2025/02/original-gold-stolen-with-fake-gold-in-uppal_bq1uZxM9mf.jpg)
ఉప్పల్, వెలుగు : ఉప్పల్ పీఎస్పరిధిలో ఓ జంట గోల్డ్షాపు యజమానికి మస్కా కొట్టింది. నకిలీ బంగారాన్ని తాకట్టు పెట్టి రూ.20 వేలు తీసుకోవడమే కాకుండా, పోతూ గోల్డ్షాపులో 12 వన్గ్రామ్గోల్డ్ నాణేలు ఎత్తుకెళ్లింది. కావలి లక్ష్మి(35), తిరుపతి(42) భార్యాభర్తలు. శుక్రవారం వీరిద్దరూ ఉప్పల్ భరత్ నగర్ లోని జ్యువెలరీ షాపుకు వచ్చారు. 5 గ్రాముల బంగారు చెవి కమ్మలు తాకట్టు పెట్టి షాపు యజమాని తండ్రి దేవి లాల్ శర్మ వద్ద రూ.20 వేలు తీసుకున్నారు. తర్వాత షాపుకు వచ్చిన యజమాని దేవీలాల్ రాకేశ్తాకట్టు పెట్టిన బంగారాన్ని పరిశీలించగా అది వన్ గ్రామ్ గోల్డ్ అని తెలిసింది.
వెంటనే సీసీ కెమెరాలు పరిశీలించగా లక్ష్మి, తిరుపతి దంపతులు దేవీలాల్శర్మకు మస్కా కొట్టినట్లు గుర్తించాడు. పైగా వారు షాపులోని 12 వన్గ్రామ్లక్ష్మీదేవి బంగారు నాణేలు ఎత్తుకెళ్లినట్లు తెలుసుకున్నాడు. అతని ఫిర్యాదుతో పోలీసులు వారిని పట్టుకున్నారు. 24 గంటల్లోనే కేసును ఛేదించారు.