
అంబేద్కర్ను రాజకీయాల కోసం వాడుకున్న కాంగ్రెస్
నిజామాబాద్ ఎంపీ అర్వింద్ కామెంట్స్
నిజామాబాద్, వెలుగు: తమది సంచులు మోసే సంస్కృతి కాదని, జాతీయవాదాన్ని మోస్తామని ఎంపీ ధర్మపురి అర్వింద్అన్నారు. జాతీయ పార్టీలు సంచులు, చెప్పులు మోస్తున్నాయన్న కేటీఆర్వ్యాఖ్యలపై ఆయన ఫైర్అయ్యారు. కేటీఆర్చెల్లి కవిత ఢిల్లీకి లిక్కర్సంచులు మోశారని, రేవంత్రెడ్డికి సంచులు మోసిన ఘనత ఉందని ఆయన ఆరోపించారు.
ఆదివారం ‘ గావ్చలో.. -బస్తీ చలో’ ప్రోగ్రామ్లో భాగంగా నిజామాబాద్ లోని అంబేద్కర్విగ్రహాన్ని పాలతో శుద్ధి చేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్చీఫ్ కేసీఆర్కు తన కుటుంబం రాజకీయ భిక్ష పెట్టిందన్నారు. కేసీఆర్ టీఆర్ఎస్పెట్టినప్పుడు అమెరికాలో ఉన్న కేటీఆర్, కవిత తెలంగాణ ఎక్కడ వస్తదంటూ తండ్రిని తిట్టేవారని చెప్పారు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ను కాంగ్రెస్ ఓట్లు, రాజకీయ ప్రయోజనాల కోసమే వాడుకుంటుందని ఆయన ఆరోపించారు.
ఇన్నాళ్లు కాంగ్రెస్పాలిటిక్స్ గురైన అంబేద్కర్విగ్రహాలను దేశవ్యాప్తంగా పాలతో కడిగి శుద్ధి చేస్తున్నామన్నారు. ఆర్మూర్ఎమ్మెల్యే పైడి రాకేష్రెడ్డి, నిజామాబాద్అర్బన్ఎమ్మెల్యే ధన్పాల్సూర్యనారాయణ. నేషనల్పసుపు బోర్డ్ చైర్మన్ పల్లె గంగారెడ్డి తదితరులు
ఉన్నారు.