
- మిగిలిన 20 శాతం మందికి నీళ్లివ్వడానికి ఔటర్ప్రాజెక్ట్–3
- సర్కారు అనుమతిచ్చిన వెంటనే పట్టాలెక్కనున్న ప్రాజెక్టు
- ఇప్పటికే రెండు దశలతో 80 శాతం మందికి నీళ్లు
హైదరాబాద్సిటీ, వెలుగు : గ్రేటర్హైదరాబాద్పరిధి విస్తరిస్తున్న నేపథ్యంలో అందుకు తగ్గట్టు తాగునీటి సరఫరా పరిధిని విస్తరించేందుకు వాటర్బోర్డు సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగా ఔటర్వాటర్ప్రాజెక్టు పేరుతో రెండు దశల పనులను పూర్తి చేసిన అధికారులు ఈ జనవరి నుంచి ఓఆర్ఆర్పరిధిలోని ప్రాంతాల్లో ఉంటున్న సుమారు 11 లక్షల మందికి తాగునీటిని అందిస్తోంది. 20 శాతం ఏరియాలు మిగలగా, ఆ పరిధిలోని జనాలకూ తాగునీరందించడానికి ప్రాజెక్టు-3ని మొదలుపెట్టబోతోంది. ప్రభుత్వం నుంచి గ్రీన్సిగ్నల్ఇవ్వగానే ఈ ప్రాజెక్టు పట్టాలెక్కబోతున్నది.
ఔటర్ వాటర్ ప్రాజెక్ట్–1,2 తో..
ఔటర్ వాటర్ప్రాజెక్ట్–1లో భాగంగా రింగ్రోడ్పరిధిలోని ప్రాంతాలకు తాగునీరందించేందుకు వాటర్బోర్డు 70 మిలియన్లీటర్ల కెపాసిటీ గల 164 రిజర్వాయర్లను రూ.124 కోట్లతో నిర్మించింది. రూ.527 కోట్లతో 1601 కిలోమీటర్ల మేర పైప్లైన్వ్యవస్థ నిర్మించింది. వీటితో 4,25,385 మందికి తాగునీటిని అందిస్తున్నారు.
ఔటర్ప్రాజెక్ట్–2తో 6,56,185 మందికి తాగునీళ్లివ్వడానికి 140.50 ఎంఎల్కెపాసిటీ ఉన్న 71 రిజర్వాయర్లను రూ. 189కోట్లతో నిర్మించింది. 2758 కిమీ. పరిధిలో రూ.778 కోట్లతో పైప్లైన్వ్యవస్థ నిర్మించింది. మొదటి దశలో43,857 కనెక్షన్లు, రెండో దశ ద్వారా 63,270 కనెక్షన్లు మంజూరు చేసింది. 670 కి.మీ. పరిధి మిగలగా, ఆ ఏరియాల్లో పైన్లైన్వ్యవస్థను ఔటర్ వాటర్ ప్రాజెక్టు–3లో నిర్మించాలని ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఇది ఓకే అయితే, వచ్చే ఏడాది నుంచి మిగిలిన ఏరియాలకు
తాగునీళ్లందించనున్నారు.