ఎంఎస్​ఎంఈల కోసం హైదరాబాద్ ​నాచారంలో ఔట్​రీచ్​ క్యాంప్

ఎంఎస్​ఎంఈల కోసం హైదరాబాద్ ​నాచారంలో ఔట్​రీచ్​ క్యాంప్

హైదరాబాద్​, వెలుగు: ఎంఎస్​ఎంఈలను ప్రోత్సహించడంలో భాగంగా యూనియన్​ బ్యాంక్​ బుధవారం హైదరాబాద్ ​నాచారంలో ఔట్​రీచ్​ క్యాంప్​ నిర్వహించింది. దీనిని మల్కాజ్​గిరి ఎంపీ ఈటల రాజేందర్ ​ప్రారంభించారు. ఎంఎస్ఎంఈల కోసం బ్యాంకు అందజేస్తున్న ఫైనాన్షియల్ ​ప్రొడక్టుల గురించి అధికారులు ఈ సందర్భంగా వివరించారు.

మహిళా ఎంఎస్​ఎంఈ ఎంట్రప్రిన్యూర్ల కోసం యూనియన్ ​నారీశక్తి స్కీమ్​ ఉందని చెప్పారు. దాదాపు 300 మంది ఎంఎస్​ఎంఈల యజమానులు, ఎస్​హెచ్​జీ కస్టమర్లు క్యాంపునకు వచ్చారు. రూ.50 కోట్ల విలువైన లోన్లను వారికి అందిచారు. కార్యక్రమంలో బ్యాంకు ఆఫీసర్లు రఘునాథ్​, భాస్కర రావు, సుధాకర రావు, రజీబ్​ లోన్​తదితరులు పాల్గొన్నారు.