
- యాక్టివ్గా 65 శాతం సంస్థలు
న్యూఢిల్లీ: మనదేశంలో 28 లక్షలకుపైగా కంపెనీలు రిజిస్టర్ అయ్యాయని, వీటిలో 65 శాతం యాక్టివ్గా ఉన్నాయని ప్రభుత్వం తెలిపింది. ఇందులో 5,216 విదేశీ సంస్థలు కంపెనీల చట్టం 2013 ప్రకారం రిజిస్టర్కాగా, 3,281 యాక్టివ్గా ఉన్నాయి. మొత్తం 16,781 కంపెనీల పెయిడ్ అప్ క్యాపిటల్ విలువ గత నెల నాటికి రూ.816.14 కోట్లని కేంద్ర కార్పొరేట్వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దాదాపు 9,49,934 కంపెనీలు మూతబడ్డాయి.
యాక్టివ్ కంపెనీల్లో 27 శాతం కంపెనీలు బిజినెస్ సర్వీసెస్ రంగంలో, 20 శాతం మాన్యుఫాక్చరింగ్ సెక్టార్లో, 13 శాతం ట్రేడింగ్, పర్సనల్, సోషల్ సర్వీసుల రంగంలో ఉన్నాయి. అత్యధిక యాక్టివ్ కంపెనీల జాబితాలో మహారాష్ట్ర మొదటిస్థానంలో ఉండగా, ఢిల్లీ, యూపీ, పశ్చిమ బెంగాల్ తరువాతి స్థానాల్లో ఉన్నాయి.