ఆ ఒక్క ఏసీ ఓవర్ హీట్ వల్ల.. రెండు అంతస్తుల బిల్డింగ్ కాలిపోయింది..!

ఆ ఒక్క ఏసీ ఓవర్ హీట్ వల్ల.. రెండు అంతస్తుల బిల్డింగ్ కాలిపోయింది..!

ఇంట్లో ఏసీ ఉంటే.. చల్లగా, హాయిగా పడుకోవచ్చ నుకుంటారు. మధ్యప్రదేశ్ లోని జబల్ పూర్ లో జరిగిన ఓ ఘటన అందర్ని షాక్ కు గురిచేస్తుంది. జబల్‌పూర్‌లో అక్టోబర్ 9న ఏసీ ఓవర్ హీట్ కావడంతో రెండంతస్తుల ఇంట్లో మంటలు చెలరేగాయి. చుట్టుపక్కల నివాసితులు భయాందోళనకు గురై పరుగులు తీశారు. మంటల వల్ల చుట్టు పక్కల ఇల్లు కూడా పొగతో నిండిపోయింది. ఓంటీ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వచ్చే జబల్‌పూర్‌లోని కరంచంద్ చౌక్‌లోని ఇంట్లో ఏసీ ఓవర్ హీట్ అయ్యింది. 

ALSO READ | ఇంత దరిద్రంగా ఉన్నారా : స్వీట్, డ్రైఫ్రూట్, లిక్కర్ షాపుల్లో వరసపెట్టి దోపిడీలు

ఏసీ నుంచి దట్టమైన పొగలు వచ్చి మంటలు వ్యాపించాయి. కొద్దిసేపటికే ఆ మంటలు రెండు అంతస్థుల బిల్డింగ్ మొత్తానికి అంటుకున్నాయి. ఆ టైంలో ఇంట్లో ఉన్నవారు బయటకు పరుగులు తీశారు. వెంటనే ఎమర్జెన్సీ సర్వీస్ కు సమాచారం ఇచ్చారు. ఫైర్ సిబ్బంది వచ్చి మంటలను ఆర్పారు. అదృష్టశాత్తూ.. ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఆస్థి నష్టం మాత్రం జరిగింది.