
మెదక్, వెలుగు : కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర చేపట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా గురువారం మెదక్ పట్టణంలో భారత్ జోడో సమ్మేళన్ పేరుతో పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రచార రథంపై డీసీసీ ప్రెసిడెంట్ కంఠారెడ్డి తిరుపతిరెడ్డి ఫొటో ఉండడంపై, టీపీసీసీ అధికార ప్రతినిధి మ్యాడం బాలకృష్ణ అనుచరులు అభ్యంతరం వ్యక్తం చేశారు. బాలకృష్ణ అనుచరుడు రథం తాళం చెవి తీసుకోవడంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగింది.
పార్టీ హైకమాండ్ ఇంకా ఇవరికి టికెట్ కేటాయించలేదని, అలాంటప్పుడు పార్టీ ప్రచార రథం మీద ఒకరి ఫొటోనే ఎలా పెట్టుకుంటారని బాలకృష్ణ అనుచరులు మండిపడ్డారు. మాజీ ఎమ్మెల్యే శశిధర్ రెడ్డి తదితర నాయకులు కార్యకర్తలను సముదాయించారు. అనంతరం పాదయాత్ర ముందుకు సాగింది.