వడ్ల కొనుగోలు కేంద్రాలు ప్రారంభం

 వడ్ల కొనుగోలు కేంద్రాలు ప్రారంభం

రేగొండ/ పర్వతగిరి, వెలుగు: రైతులకు అందుబాటులో ఉండే విధంగా ప్రజాప్రతినిధులు, అధికారులు వడ్ల కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తున్నారు. శుక్రవారం జయశంకర్​ భూపాలపల్లి జిల్లాలోని రేగొండ, కొత్తగోరితండాల్లో పీఏసీఎస్​ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ ప్రారంభించారు.

 వరంగల్​ జిల్లా పర్వతగిరి మండలం చింతనెక్కొండలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కేంద్రాన్ని తహసీల్దార్​ వెంకటస్వామి ప్రారంభించారు. రోళ్లకల్లు చెరువుముందు తండాలో నవజీవన్​ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని కాంగ్రెస్​ పార్టీ మండలాధ్యక్షుడు జాటోత్​ శ్రీనివాస్​ నాయక్​ ప్రారంభించారు.