
ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణికి కేంద్రం పద్మశ్రీ అవార్డును ప్రకటించింది. తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటడంలో కృషి చేసినందుకు గానూ ఏపీ నుంచి ఈ ఆవార్డుకు ఆయన ఎంపిక అయ్యారు. అటు తెలంగాణ నుంచి అధ్యాత్మిక రంగంలో చినజీయర్ స్వామి, కమలేశ్ డి పటేల్లకు పద్మభూషణ్ అవార్డు లభించింది. ఈ ఏడాదికి గాను మొత్తంగా 106 పద్మ పురస్కాలు ప్రకటించిన కేంద్రం వీటిలో ఆరుగురిని పద్మవిభూషణ్, తొమ్మిది మందిని పద్మభూషణ్, 91మందిని పద్మశ్రీ పురస్కారాలకు ఎంపిక చేసింది. తెలుగు రాష్ట్రాల నుంచి మొత్తం 12మందిని పద్మ పురస్కారాలు వరించాయి.
తెలంగాణ నుంచి పద్మశ్రీ
- మోదాడుగు విజయ్ గుప్తా (సైన్స్ అండ్ ఇంజనీరింగ్)
- బి.రామకృష్ణా రెడ్డి(లిటరేచర్ &ఎడ్యుకేషన్)
- హనుమంతరావు పసుపులేటి (వైద్యం)
ఆంధ్రప్రదేశ్ నుంచి పద్మశ్రీ
- ఎం.ఎం.కీరవాణి (కళలు)
- గణేశ్ నాగప్ప కృష్ణరాజనగర
- అబ్బారెడ్డి నాగేశ్వరరావు; (సైన్స్ అండ్ ఇంజినీరింగ్)
- సీవీ రాజు
- కోట సచ్చిదానంద శాస్త్రి (ఆర్ట్)
- సంకురాత్రి చంద్రశేఖర్ (సామాజిక సేవ)
- ప్రకాశ్ చంద్రసూద్ (సాహిత్యం, విద్య విభాగంలో)