దక్షిణ మధ్య రైల్వే పీసీసీఎంగా పద్మజ

దక్షిణ మధ్య రైల్వే పీసీసీఎంగా పద్మజ

సికింద్రాబాద్, వెలుగు: దక్షిణ మధ్య రైల్వే ప్రిన్సిపల్ చీఫ్ కమర్షియల్ మేనేజర్ గా కె. పద్మజ నియమితులయ్యారు. గురువారం ఆమె రైల్​నిలయంలో  బాధ్యతలు స్వీకరించారు. ఇండియన్ రైల్వేస్ ట్రాఫిక్ సర్వీస్ 1991 బ్యాచ్​కు చెందిన పద్మజ ఇప్పటివరకు ద.మ.రైల్వే చీఫ్ ట్రాన్స్​పోర్టేషన్​ప్లానింగ్ మేనేజర్​గా పనిచేశారు. అంతకు ముందు భారతీయ రైల్వేలోని వేర్వేరు డివిజన్లలో పనిచేశారు. దక్షిణ మధ్య రైల్వేలో పీసీసీఎంగా బాధ్యతలు చేపట్టిన తొలి మహిళా అధికారి పద్మజ.