
జమ్మూకాశ్మీర్ లోని పహల్గాంలో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో 26 మంది టూరిస్టులు మృతిచెందిన విషయం తెలిసిందే. మంగళవారం మధ్యాహ్నం బైసారన్ పర్యాటక ప్రాంతంలో టూరిస్టులపై ఉగ్రవాదులు దాడి చేసి అమాయకులైన టూరిస్టులను కాల్చి చంపారు. ఈ ఘటన పుల్వామా దాడి తరవాత పౌరులపై జరిగిన అతిపెద్ద టెర్రరిస్టు అటాక్ ఇదే. ఈ టెర్రర్ దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారితో దేశం నలుమూలలనుంచి వివిధ రాష్ట్రాలకు చెందిన పర్యాటకులున్నన్నారు. చనిపోయిన వారి వివరాలు..
వినయ్ నర్వాల్ , నేవీ అధికారి, కర్నాల్, హర్యానా
చంద్రమౌళి, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్
మధుసూదన్, నెల్లూరు జిల్లా కావలి, ఆంధ్రప్రదేశ్
అతుల్ మోనే, ముంబై
హేమంత్ జోషి, ముంబై
సంజయ్ లేలే, థానే , మహారాష్ట్ర
ప్రశాంత్ సత్పతి, ఒడిషా
మనీష్ రంజన్, హైదరాబాద్
తాగే హాలియింగ్, అరుణాచల్ ప్రదేశ్
భరత్ భూషన్, బెంగళూరు
మంజునాథ్ రావు, శివమెగ్గ, కర్ణాటక