నాగోల్​, మియాపూర్​ మెట్రో స్టేషన్లలో ఇయ్యాల్టి నుంచి పెయిడ్ ​పార్కింగ్​

 నాగోల్​, మియాపూర్​ మెట్రో స్టేషన్లలో ఇయ్యాల్టి నుంచి పెయిడ్ ​పార్కింగ్​

హైదరాబాద్​సిటీ, వెలుగు: నాగోల్, మియాపూర్ మెట్రో స్టేషన్లలో పెయిడ్​పార్కింగ్ విషయంలో కొద్దినెలలుగా దోబూచులాడుతున్న ఎల్అండ్ టీ ఎట్టకేలకు నేటి నుంచి అమలు చేయనుంది. గతంలో మూడుసార్లు బోర్డులు ఏర్పాటు చేసి, ప్రయాణికుల నుంచి వ్యతిరేకత రావడంతో వెనక్కి తగ్గింది. ఈ నెల 26న ఆయా స్టేషన్లలో పెయిడ్​పార్కింగ్ తీసుకొస్తున్నట్లు అధికారికంగా ప్రకటించి, ప్రస్తుతం పార్కింగ్ ఏరియాలో చార్జీల​బోర్డులు ఏర్పాటు చేసింది. 

గత చార్జీల బోర్టుతో పోలిస్తే కొంత తగ్గించింది. మరోవైపు, పెయిడ్​పార్కింగ్​ను తక్షణమే ఉపసంహరించుకోవాలని యువజన సంఘాలు, మెట్రో ప్రయాణికులు నాగోల్ స్టేషన్ వద్ద శనివారం నిరసన చేపట్టారు. 

గతంలో ఏర్పాటు చేసిన బోర్డు ప్రకారం 

టూ వీలర్ చార్జీలు

కనీసం 2 గంటల వరకు  రూ.10
8 గంటలు    రూ. 25
12 గంటలు  రూ.40
12 గంటలు దాటితే ప్రతి గంటకు రూ.5 

ఫోర్​ వీలర్​ చార్జీలు

2 గంటల వరకు రూ.30
8గంటలు రూ. 75
12 గంటలు రూ. 120
12 గంటల దాటితే ప్రతి గంటకు  రూ.15

ప్రస్తుతం చార్జీలు​

టూ వీలర్ చార్జీలు

0–2  గంటల వరకు రూ. 10
2–3 గంటలు రూ. 15
3–4 గంటలు రూ. 20
4–12 గంటలు రూ. 25

ఫోర్​ వీలర్​ చార్జీలు

0–2 గంటల వరకు రూ. 30

2–3 గంటల రూ.45
3–4 గంటల రూ.60
4–12 గంటల రూ.75