బరితెగించిన పాక్ సోషల్​ మీడియా.. లెఫ్టినెంట్​ జనరల్​ను తొలగించారంటూ తప్పుడు వార్తలు

బరితెగించిన పాక్ సోషల్​ మీడియా.. లెఫ్టినెంట్​ జనరల్​ను తొలగించారంటూ తప్పుడు వార్తలు
  • సుచీంద్రకుమార్ అరెస్టు అయ్యారంటూ పోస్ట్ లు
  • ఇవాళ పదవీ విరమణ చేస్తున్న అధికారి

ఢిల్లీ: పాకిస్తాన్​ సోషల్​ మీడియా మరోసారి బరిదెగించింది. కట్టుకథలు, తప్పుడు వార్తలతో విషం చిమ్మింది. పహల్గాం ఉగ్రదాడి వైఫల్యానికి బాధ్యుడిని చేస్తూ నార్తర్న్ ఆర్మీ కమాండర్​ లెఫ్టినెంట్​ జనరల్​ ఎంవీ సుచీంద్రకుమార్​ను ఆ పదవి నుంచి తొలగించారంటూ పాక్​ అనుకూల సోషల్​ మీడియాలో తప్పుడు వార్తలు పోస్ట్ చేశారు. 

మరికొన్ని సోషల్​ మీడియా ఖాతాల్లో అతడిని అరెస్టు కూడా చేశారంటూ రాసుకొచ్చారు. అయితే ఆ ప్రచారాన్ని భారత్​ ఖండించింది. అవన్నీ తప్పుడు వార్తలుగా స్పష్టం చేసింది. నిజానికి ఆయన ఇవాళ పదవీ విరమణ చేస్తున్నట్లు తెలిపింది. ఆయన స్థానంలో కొత్తగా లెఫ్టినెంట్​ జనరల్ ప్రతీక్​ శర్మ బాధ్యతలు స్వీకరిస్తారని ప్రెస్​ ఇన్​ఫర్మేషన్​ బ్యూరో ఫాక్ట్ చెక్​ వెల్లడించింది.