హిందూ దేవాలయ అభివృద్ది పాక్​ రూ. కోటి కేటాయింపు

హిందూ దేవాలయ అభివృద్ది పాక్​ రూ. కోటి కేటాయింపు

పాకిస్థాన్​ ప్రభుత్వం పంజాబ్​ ప్రావిన్స్​లోని హిందూ దేవాలయాన్ని పునరుద్దరించాలని కీలక నిర్ణయం తీసుకుంది.  ప్రావిన్స్​ నరోవర్​ జిల్లాలోని జఫర్యాల్​ లోని బావోలీ సాహెబ్​ దేవాలయాన్ని పునర్మించేందకు కోటి రూపాయిలను  ( రూ. 10 మిలియన్లు)పాకిస్తాన్​ ప్రభుత్వం మంజూరు చేసింది.  ఈ ఆలయం 64 సంవత్సరాలుగా మూసి ఉంది.  డాన్​ న్యూస్​ తెలిపిన వివరాల ప్రకారం 1960లో ఈ దేవాలయంలో సేవలను నిలిపి వేశారు.ఈ ఆలయాన్ని తిరిగి నిర్మించే బాధ్యతను పాకిస్థాన్​ లోని మైనార్టీ ప్రార్థనా స్థలాలను పర్యవేక్షించే ఎవాక్యుయీ ట్రస్ట్ ప్రాపర్టీ బోర్డ్ (EPTB)కు అప్పగించింది.  అయితే ఈపీటీబీ ఈ దేవాలయాన్ని ఆధీనంలోకి తీసుకున్న తరువాత  మూసివేశారని పాక్​ ధర్మస్థాన్​ కమిటి మాజీ అధ్యక్షుడు రతన్​ లాల్​ ఆర్య తెలిపారు.  

బావోలీ సాహెబ్​ దేవాలయాన్ని నిర్మించే స్థలానికి నాలుగు వైపులా ప్రహరీగోడను నిర్మించిన తరువాత పాక్ ధర్మస్థాన్ కమిటీకి అప్పగించనున్నారు.  ఆ తర్వాత ఆలయాన్ని పాక్ ధర్మస్థాన్ కమిటీకి అప్పగించనున్నారు. నరోవర్​ జిల్లా వ్యాప్తంగా  1,453 హిందువులు ఉన్నప్పటికి ఒక్కటి కూడా హిందూ దేవాలయం లేదు. ప్రస్తుతం నరోవర్​ జిల్లాలోని హిందువులు దేవాలయానికి వెళ్లాలంటే . లాహోర్​ కాని, సియాల్​ కోట్​ గాని వెళ్లాల్సి ఉంది.  ఒకప్పుడు నరోవల్​ జిల్లాలో 45 హిందూ దేవాలయాలు ఉన్నాయి.  వాటిని ఎవరూ పట్టించుకోకపోవడంతో శిథిలావస్థకు చేరుకున్నాయి.  

పాకిస్థాన్​ లో హిందువులు మైనార్టీ వర్గంగా ఉన్నారు.   దేశ వ్యాప్తంగా దాదాపు 7.5 మిలియన్ల మంది హిందువులు ఉన్నారని పాక్​ప్రభుత్వం అంచనాలున్నాయి.   అయితే ఎక్కువ మంది హిందువులు సింధ్​ ఫ్రావిన్స్​ లో ఉన్నారు. హిందువులు పాకిస్థాన్లో అతిపెద్ద మైనారిటీ వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు..  బావోలీ సాహిబ్ హిందూ ఆలయం పునర్నిర్మాణ పనులు పూర్తయితే స్థానిక హిందువుల చిరకాలవాంఛ నెరవేరుతుంది.