
మహబూబ్నగర్, వెలుగు: మహబూబ్నగర్ పార్లమెంట్కు 1952లో మొదటి సారి ఎన్నికలు జరిగాయి. ఇప్పటి వరకు 17 సార్లు ఎన్నికలు జరిగినా, ఒక్క మహిళా ఎంపీ కూడా పార్లమెంట్కు ఎన్నిక కాలేదు. ఇప్పటి వరకు జె రామశ్వర్రావు, మల్లికార్జున్ గౌడ్ నాలుగు సార్ల చొప్పున, ఎస్.జైపాల్ రెడ్డి, ఏపీ జితేందర్ రెడ్డి రెండేసి సార్లు, జనార్దన్ రెడ్డి, ముత్యాల్రావు, డి.విఠల్రావు, కేసీఆర్, మన్నె శ్రీనివాస్ రెడ్డి ఒక్కో టర్మ్ ఎంపీలుగా చేశారు. కానీ, 2019 ఎన్నికల్లో డీకే అరుణ పోటీ చేయగా, 3,33,573 ఓట్లు సాధించి సెకండ్ ప్లేస్లో నిలిచారు. ఈ సారి ఎన్నికల్లో 5,10,747 ఓట్లు సాధించి విజయం సాధించారు.