పాలేరు ప్రాజెక్టు నుంచి రెండు రోజుల్లో సాగునీటి విడుదల

పాలేరు ప్రాజెక్టు నుంచి  రెండు రోజుల్లో సాగునీటి విడుదల

కూసుమంచి, వెలుగు : యాసంగి సీజన్​లో వరి పంటకు పాలేరు ప్రాజెక్టు నుంచి నీటిని కొద్ది రోజులుగా ఇరిగేషన్​ అధికారులు నిలిపివేయగా పంటలు ఎండుముఖం పట్టాయి. ఈ క్రమంలో రెండు రోజుల్లో పాత కాలువకు సాగునీటిని విడుదల చేస్తామని ఐబీ డీఈ మధు శుక్రవారం తెలిపారు. 9 రోజులు ఆన్, 6 రోజులు ఆఫ్​పద్ధతిలో నీటిని విడుదల చేస్తున్నట్లు చెప్పారు. 

జలాశయం నీటిమట్టం తగ్గడంతో తాగునీటిని దృష్టిలో పెట్టుకొని భక్తరామదాసు ఎత్తిపోతల పథకం నుంచి ఎస్సారెస్సీ కాలువ ద్వారా 170 క్యూసెక్కులు, మిషన్​ భగీరథ తాగునీటికి 135 క్యూసెక్కులు, సాగర్​కాలువకు 4,233 క్యూసెక్కులు ఔట్​ఫ్లో ఉండగా,  సాగర్​ నుంచి ఇన్​ఫ్లో 4,328 క్యూసెక్కుల నీరు వస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 23 అడుగులు కాగా,  ప్రస్తుతం నీటిమట్టం15 అడుగులు ఉందని చెప్పారు.