17 అడుగులకు చేరిన పాలేరు

17 అడుగులకు చేరిన పాలేరు

పాలేరు జలాశయానికి నాలుగు రోజుల నుంచి సాగర్​ జలాలు వస్తున్న సంగతి తెలిసిందే. జలాశయం పూర్తిస్థాయి సామర్థ్యం 23 అడుగులు కాగా, గురువారం నాటికి 17 అడుగుల నీటిమట్టానికి చేరుకుంది. సాగర్​నుంచి ఒక టీఎంసీ నీటిని విడుదల చేయగా నేటితో నీటి సరఫరాను అధికారులు నిలిపేశారు. ఫ్లో తగ్గడంతో మరో అర అడుగు శుక్రవారం నాటికి జలాశయానికి చేరుకోనుంది.

ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, సూర్యాపేట జిల్లాలకు మిషన్​ భగీరథ పథకం ద్వారా తాగునీటిని రోజుకు 135 క్యూసెక్కుల నీటిని సరఫరా చేస్తారు. ప్రస్తుతం నీరు మరో 72 రోజుల వరకు తాగునీటి అవసరాల కోసం వినియోగించవచ్చునని ఇరిగేషన్​ ఆఫీసర్లు చెబుతున్నారు.  

కూసుమంచి, వెలుగు