
జనగామ/కొమురవెల్లి, వెలుగు : కాంగ్రెస్కు ఓటు అడిగే హక్కే లేదు, వాళ్లకు అధికారం ఇస్తే సంక్షేమ పథకాలన్నీ బంద్ అవుతాయని జనగామ బీఆర్ఎస్ క్యాండిడేట్ పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. ప్రతిపక్షాలను బొందపెట్టి, ప్రతీ ఒక్కరు కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. జనగామ నియోజకవర్గం కొమురవెల్లి మండలంలోని కిష్టంపేట, రాంసాగర్, గౌరాయిపల్లి, మర్రిముస్త్యాల, లెనిన్నగర్, కొమురవెల్లిలో శుక్రవారం ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు లీడర్లు, యువత పల్లా సమక్షంలో బీఆర్ఎస్లో చేరగా వారికి కండువాలు కప్పి ఆహ్వానించారు. అనంతరం పల్లా మాట్లాడుతూ సీఎం కేసీఆర్ పాలనలోనే అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు.
అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణ అద్భుత ప్రగతి సాధించిందని చెప్పారు. కార్యకర్తలకు అన్నివిధాలా అండగా ఉంటామని, ఏ కష్టమొచ్చినా కంటికి రెప్పలా కాపాడుకుంటానని భరోసా ఇచ్చారు. కాంగ్రెస్ క్యాండిడేట్ కొమ్మూరి ప్రతాప్రెడ్డికి బీఆర్ఎస్ అన్ని అవకాశాలు ఇచ్చినా వ్యాపారం కోసం పార్టీ మారిండని విమర్శించారు. ‘నాది తరిగొప్పుల పక్కన ఉన్న షోడషపల్లి.. నేను కూడా జనగామ లోకలే వ్యక్తినే’ అన్నారు. రేషన్కార్డు ఉన్నవాళ్లందరికీ ఘట్కేసర్ వద్ద ఉన్న నీలిమా హాస్పిటల్లో ఉచితంగా ట్రీట్మెంట్ చేయించే బాధ్యత తనదేనన్నారు. తాను ఉద్యమకారుడినేనని, పోరాటాల్లో భాగంగా జైలుకు కూడా వెళ్లానని, జనగామకు చెందిన రవీందర్రెడ్డి అనే లాయరే బెయిల్ ఇప్పించారని గుర్తు చేశారు.
కిష్టంపేట జనాలు బీఆర్ఎస్కే ఓటు వేస్తామని చెప్పడం సంతోషంగా ఉందన్నారు. బీఆర్ఎస్ గెలిచేకా వచ్చే నెల నుంచే రూ. 400కే గ్యాస్ వస్తుందన్నారు. ఈ నెల 18న చేర్యాలకు కేసీఆర్ వస్తారని, రెవెన్యూ డివిజన్ విషయాన్ని మరోసారి గుర్తు చేద్దామన్నారు. కాంగ్రెస్కు ఓటు వేస్తే ఆగమైంతమన్నారు. అలాగే పల్గాను గెలిపించాలని కోరుతూ జనగామలో 11, 15, 17వ వార్డుల్లో ఆయన భార్య నీలిమ ఇంటింటి ప్రచారం చేశారు.