
సూర్యాపేట జిల్లా పంచాయతీరాజ్ విభాగం ఏఈ కోసూరి రంగరాజు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. హుజూర్నగర్ పంచాయతీరాజ్ డీఈ కార్యాలయంలో ఏసీబీ దాడి జరిగింది. రూ. 5 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. హుజూర్ నగర్ పంచాయతీరాజ్ ఏఈ కోసూరి రంగరాజు ఎంబీ రికార్డ్ కోసవ రూ 5 వేలు లంచం డిమాండ్ చేశారు. మేళ్లచెరువు,చింతలపాలెం మండలాల పంచాయతీరాజ్ ఏఈగా విధులు నిర్వహిస్తున్నారు. మేళ్లచెరువు ,చింతలపాలెం పంచాయతీరాజ్ ఆఫీసులో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. ఇంకా పూర్తి సమాచారం అందవలసి ఉంది.