ఏప్రిల్ 28న పంచాయతీ రాజ్​ఉద్యోగులకు వర్క్ షాప్

ఏప్రిల్ 28న పంచాయతీ రాజ్​ఉద్యోగులకు వర్క్ షాప్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని పంచాయతీరాజ్, రూరల్ డెవలప్ మెంట్ డిపార్ట్​మెంట్ ఉద్యోగులకు సోమవారం  వర్క్ షాప్ నిర్వహించనున్నారు. ఖైరతాబాద్ లోని పంచాయతీరాజ్, రూరల్ డెవలప్ మెంట్ కమిషనర్ కార్యాలయంలో వర్క్​షాప్  జరుగుతుందని పీఆర్, ఆర్ డీ డైరెక్టర్ సృజన ఒక  ప్రకటనలో తెలిపారు. 

ఉదయం 10 గంటలకు వర్క్​షాప్ ప్రారంభం కానున్నది. జడ్పీ సీఈవో, డీఆర్​డీవోలు, డీపీవోలు, పంచాయతీరాజ్ ఇంజినీర్లు విధిగా హాజరుకావాలని కోరారు. ఈ వర్క్​షాప్​కు మంత్రి సీతక్క హాజరవుతారని సమాచారం. గ్రామాల అభివృద్ధి, ఉపాధి పనులపై చర్చించనున్నట్టు తెలుస్తోంది.