
- వంశీకృష్ణసహా ముగ్గురి కస్టడీ కోరిన పోలీసులు
హైదరాబాద్, వెలుగు: సిద్దిపేటకు చెందిన రాజకీయ నేత చక్రధర్ గౌడ్ ఫోన్ ట్యాపింగ్ కేసులో పంజాగుట్ట పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. చక్రధర్ గౌడ్ను బెదిరించి, బ్లాక్ మెయిల్ చేసిన వంశీకృష్ణ, సంతోష్ కుమార్, బండి పరశురాములును కస్టడీకి తీసుకొని విచారించనున్నారు. ఈ మేరకు వారం రోజులు కస్టడీ కోరుతూ సోమవారం నాంపల్లి కోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై మంగళవారం విచారణ జరగనున్నది. కాగా, వంశీకృష్ణను హరీశ్రావు పేషీలో నియమించిన సిద్దిపేటకు చెందిన మచ్చ వేణుగోపాల్కు నోటీసులు జారీ చేశారు.
చక్రధర్గౌడ్ ఫోన్ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు మాజీ మంత్రి హరీశ్ రావు కాగా.. టాస్క్ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్రావు రెండో నిందితుడిగా ఉన్నారు. గతంలో వంశీకృష్ణ హరీశ్రావు పేషీలో పనిచేశాడు.. ఇతను చక్రధర్కు, అతని అనుచరులకు కాల్స్ చేసి బెదిరింపుకు పాల్పడేవాడు.