పాపన్నపేట డీసీసీబీకి  ఉత్తమ ప్రతిభా అవార్డు

పాపన్నపేట డీసీసీబీకి  ఉత్తమ ప్రతిభా అవార్డు

పాపన్నపేట, వెలుగు: ఉమ్మడి మెదక్ జిల్లాలో 2024 –25 సంవత్సరానికి పాపన్నపేట డీసీసీబీ బ్యాంక్ కు ఉత్తమ ప్రతిభా అవార్డు లభించింది. ఈ మేరకు డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి, సీఈవో శ్రీనివాస్, డీడీఎంలు  కృష్ణ తేజ, నిఖిల్ కుమార్ చేతుల మీదుగా పాపన్నపేట బ్యాంక్ మేనేజర్ కిషన్ సోమవారం సంగారెడ్డిలో ఉత్తమ ప్రతిభ అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా మేనేజర్ మాట్లాడుతూ తాము పాపన్నపేట బ్యాంక్ మేనేజర్ గా బాధ్యతలు చేపట్టినప్పుడు రూ.39 కోట్ల బిజినెస్ కొనసాగేదని తాము వచ్చాక రూ.51.5 కోట్లకు బిజినెస్ తీసుకెళ్లామని వెల్లడించారు.

35 శాతం అభివృద్ధి సాధించిందని ఆయన వివరించారు. ఉమ్మడి జిల్లాలో తమ బ్యాంకుకు ఉత్తమ ప్రతిభ అవార్డు రావడం గర్వంగా ఉందన్నారు. తమ బ్యాంకులో గోల్డ్ లోన్, లాంగ్ టర్మ్ రుణాలు పెద్ద ఎత్తున అందిస్తున్నామని వెల్లడించారు. బంగారంపై తక్కువ వడ్డీకి రుణాలు అందిస్తున్నామని తులం బంగారానికి రూ. 58 వేల వరకు ఇస్తున్నట్లు తెలిపారు. బ్యాంకు మేనేజర్ కిషన్ ను పాపన్నపేట యువజన నాయకుడు లింగంపేట నరేందర్ గౌడ్ అభినందించారు.