పిల్లలకు క్రమశిక్షణ నేర్పించాలి

పిల్లలకు క్రమశిక్షణ నేర్పించాలి

కొత్తపల్లి, వెలుగు : తల్లిదండ్రులు తమ పిల్లలకు క్రమశిక్షణ నేర్పించాలని కొత్తపల్లి ఎస్సై సాంబమూర్తి, పారడైజ్, సెయింట్​ జార్జ్​ స్కూల్​ చైర్మన్​ ఫాతిమారెడ్డి అన్నారు. కొత్తపల్లి మండలం రేకుర్తి పారడైజ్ స్కూల్​లో పేరెంట్స్​కు శనివారం పలు క్రీడాపోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.

 గెలుపొందిన తల్లిదండ్రులకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో అకాడమిక్ సీఈవో ఉమాకాంత్, ప్రిన్సిపల్ టి.వసంత, వైస్ ప్రిన్సిపల్ ఎ.మధు, ప్రీతిరావు, ప్రియాంకరావు తదితరులు పాల్గొన్నారు.