కేటీఆర్​..శివారెడ్డిపల్లికి రా..మాట్లాడ్దాం పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి

కేటీఆర్​..శివారెడ్డిపల్లికి రా..మాట్లాడ్దాం  పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి

పరిగి , వెలుగు : ‘కాంగ్రెస్  ప్రభుత్వం ఏడాదిలో విడుదల చేసిన నిధులు,  బీఆర్ఎస్  పదేండ్లు విడుదల చేసిన నిధులు  ఎంతో చర్చిద్దాం..శివారెడ్డిపల్లికి ఎప్పుడు వస్తావో రా’ అని పరిగి  ఎమ్మెల్యే   రామ్మోహన్ రెడ్డి  మాజీ మంత్రి కేటీ ఆర్​కు సవాల్ విసిరారు. ఆదివారం పరి గిలోని ఆయన ఇంట్లో మాట్లాడుతూ కులకచర్ల మండలం మండలం దాస్య నాయక్ తండాకు అంబేద్కర్ విగ్రహావిష్కరణ కోసం కేటీఆర్ వచ్చి రేవంత్ రెడ్డిపై, ప్రజాపాలనపై అబద్దపు ఆరోపణలు చేశాడన్నారు.  

శివారెడ్డి పల్లికి వచ్చి కేటీఆర్​ మాట్లాడతానన్నారని, తాను సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు. లిక్కర్ కేసులో కేటీఆర్​ సోదరి కవిత, ఫార్ములా ఈ కార్ రేసింగ్ లో కేటీఆర్, కాళేశ్వరం ప్రాజెక్టు  కేసులో హరీశ్​ రావు, కేసీఆర్ ఆర్థికనేరాలకు పాల్పడ్డారని,  వీటిపై విచారణ జరుగుతోందన్నారు.  కవిత..తెలంగాణ ఆత్మ గౌరవాన్ని ఢిల్లీ, కేరళ లిక్కర్ కేసుల్లో దిగజార్చారన్నారు.   ఈ అన్ని విషయాలపై శివారెడ్డి పల్లికి వస్తే చర్చించడానికి తాను రెడీగా ఉన్నట్టు చెప్పారు.