Paris Olympics 2024: ఆస్ట్రేలియాపై ఘన విజయం.. క్వార్టర్ ఫైనల్‌కు భారత హాకీ టీమ్

Paris Olympics 2024: ఆస్ట్రేలియాపై ఘన విజయం.. క్వార్టర్ ఫైనల్‌కు భారత హాకీ టీమ్

పారిస్ ఒలింపిక్స్‌లో భారత హాకీ జట్టు చరిత్ర సృష్టించింది. శుక్రవారం(ఆగస్టు 02) జరిగిన గ్రూప్ స్టేజ్ మ్యాచ్ లో ఆస్ట్రేలియాపై విజయం సాధించి.. 52 ఏళ్ల నిరీక్షణకు ముగింపు పలికింది. 3-2 తేడాతో ఆసీస్ ను మట్టికరిపించిన టీమిండియా క్వార్టర్ ఫైనల్ కు అర్థత సాధించింది. 1972 మ్యూనిచ్ ఒలింపిక్స్‌ తర్వాత ఆస్ట్రేలియాను ఓడించడం ఇదే తొలిసారి.

తొలి అర్ధభాగంలో 2-1 తేడాతో వెనుకబడిన భారత్.. రెండో అర్ధభాగంలో అదరగొట్టింది. భారత్ తరుపున అభిషేక్, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ గోల్స్ వేశారు.