
పారిస్ ఒలింపిక్స్లో భారత మహిళా రెజ్లర్ వినేశ్ ఫోగట్ అదరగొట్టింది. మహిళల 50 కేజీల ఫ్రీస్టైల్ ఈవెంట్లో ఈ భారత రెజ్లర్ సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. మంగళవారం(ఆగష్టు 06) జరిగిన క్వార్టర్ ఫైనల్లో ఉక్రెయిన్ రెజ్లర్ ఒక్సానా లివాచ్ను 7 - 5 తేడాతో ఓడించి సెమీస్లోకి ఎంట్రీ ఇచ్చింది.
అంతకుముందు వినేశ్ పోగట్ 3-2తో జపాన్కు చెందిన యుయి సుసాకిని మట్టికరిపించి క్వార్టర్స్కు అర్హత సాదించింది. ఈ విభాగం ఫైనల్ ఇదే రోజు రాత్రి జరగనుంది. సెమీఫైనల్లో గబిజా డిలైట్ లేదా యుస్నీలిస్ లోపెజ్తో వినేశ్ ఫోగట్ తలపడనుంది.
??? ??????? ??? ??? ??? ?????? ??????! Vinesh Phogat was brilliant once again, defeating Oksana Livach in the quarter-final in the women's freestyle 50kg category. Oksana applied pressure on Vinesh in the last minute but Vinesh Phogat showed her class… pic.twitter.com/QhZ4AFRRUr
— India at Paris 2024 Olympics (@sportwalkmedia) August 6, 2024
ఇదిలా ఉంటే, జావెలిన్ విభాగంలో డిఫెండింగ్ ఛాంపియన్ నీరజ్ చోప్రా ఫైనల్కు అర్హత సాధించాడు. మంగళవారం(ఆగష్టు 6) జరిగిన క్వాలిఫికేషన్ రౌండ్లో ఈ డిఫెండింగ్ ఒలింపిక్ ఛాంపియన్ మొదటి ప్రయత్నంలోనే బల్లాన్ని 89.34 మీటర్ల దూరం విసిరి ఫైనల్ బెర్త్ ఖాయం చేసుకున్నాడు.