అయ్యోపాపం: ఆర్టీసీ బస్సులో గుండెపోటు.. ప్రయాణికుడు మృతి

అయ్యోపాపం:  ఆర్టీసీ బస్సులో గుండెపోటు.. ప్రయాణికుడు  మృతి

తెలంగాణ స్టేట్​ ఆర్టీసీ బస్సులో విషాద ఘటన చోటుచేసుకుంది. కరీంనగర్ ఆర్టీసీ బస్సులో(RTC bus) ప్రయాణికుడు గుండెపోటుతో మృతి చెందాడు. . వీణవంక మండలం రెడ్డిపల్లి గ్రామానికి చెందిన వడ్డేపల్లి ఓదేలు (55) కరీంనగర్ లోని ఏటీఎంలో సెక్యూరిటీ గార్డ్ గా పనిచేస్తున్నాడు. ఈ రోజు శుక్రవారం ( మార్చి7)  తన విధులను నిర్వర్తించేందుకు  వెళ్లేందుకు జమ్మికుంట నుంచి కరీంనగర్ కు వెళ్లే బస్సు ఎక్కాడు.  

బస్సు కరీంనగర్​ చేరుకోవడంతోనే ప్రయాణికులు అందరూ దిగారు. కాని ఓదేలు అనే వ్యక్తి ఒక్కడే సీటులో కూర్చొన్నాడు.  ఎంతసేపటికి అతను బస్సు దిగేందుకు రాకపోవడంతో కండక్టర్​ అతని దగ్గరకు వెళ్లి పలకరించాడు.  ఎంత సేపటికి ఓదెలులో స్పందర లేకపోవడంతో అనుమానం వచ్చి కరీంనగర్​ డిపోలోని ఆర్టీసీ కంట్రోలర్​ కు సమాచారం ఇచ్చాడు. 

ఆర్టీసీ అధికారులు 108 కి సమాచారం ఇవ్వడంతో.. వారు ఓదేలును పరిశీలించి  హార్ట్​ ఎటాక్​ తో మృతి చెందినట్టు తెలిపారు.  ఆ తరువాత కరీంనగర్​ ఆర్టీసీ డిపో సిబ్బంది వన్ టౌన్ పోలీసులకు సమాచారం అందించారు. బస్టాండ్ కు చేరుకున్న పోలీసులు ఓదేలు మృత దేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.