
- టేక్ ఆఫ్ అయ్యే టైంలో ఎమర్జెన్సీ డోర్ తెరిచే ప్రయత్నం
శంషాబాద్, వెలుగు: శంషాబాద్ఎయిర్పోర్టులో విమానం టేక్ ఆఫ్ అయ్యే టైంలో ఓ ప్యాసింజర్ గందరగోళం సృష్టించాడు. ఎమర్జెన్సీ డోర్ తెరిచేందుకు ప్రయత్నించాడు. ఎయిర్లైన్స్అధికారులు అతడిని అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించారు. సోమవారం ఉదయం శంషాబాద్ నుంచి వారణాసి వెళ్తున్న ఇండిగో విమానం(6ఈ6719)ను బిహార్కు చెందిన యువకుడు(26) ఎక్కాడు.
సరిగ్గా టేకాఫ్ అవుతున్న సమయంలో విమానం ఎమర్జెన్సీ డోర్ తెరిచేందుకు ప్రయత్నించాడు. గమనించిన ఫ్లైట్ సిబ్బంది ఎయిర్లైన్స్ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఎయిర్పోర్టు సెక్యూరిటీ గార్డులు వచ్చి అతన్ని అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించారు. కేసు నమోదైంది. ఆ తర్వాత విమానం వారణాసి బయలుదేరింది.