
- ఎయిర్పోర్టులో ప్యాసింజర్ అరెస్ట్..
- 636 గ్రాముల గోల్డ్ సీజ్
- మరో ప్యాసింజర్ నుంచి 5 గోల్డ్ బిస్కెట్లు స్వాధీనం
శంషాబాద్, వెలుగు : ఫ్యాన్ బేరింగ్లో బంగారాన్ని దాచి తెచ్చిన ప్యాసింజర్ను శంషాబాద్ ఎయిర్పోర్టులో కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. గురువారం కౌలాలంపూర్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్టుకు వచ్చిన ఓ ప్యాసింజర్ ఫ్యాన్ బేరింగ్లో బంగారాన్ని దాచి తెచ్చాడు. స్కానింగ్లో గుర్తించిన కస్టమ్స్ అధికారులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. బేరింగ్లో దాచిన 636 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.
అదే విధంగా రియాద్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్టుకు వచ్చిన మరో ప్యాసింజర్ నుంచి 5 గోల్డ్ బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరి నుంచి పట్టుబడ్డ బంగారం కిలో 218.6 గ్రాములు కాగా.. దీని విలువ సుమారు 73 లక్షల 8 వేలు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. ఇద్దరిపై కస్టమ్స్ యాక్ట్ కింద కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేపట్టారు.