ఎన్ఎంఆర్​ యువసేన ఆధ్వర్యంలో బైక్​ ర్యాలీ

ఎన్ఎంఆర్​ యువసేన ఆధ్వర్యంలో బైక్​ ర్యాలీ

పటాన్​చెరు, వెలుగు : కాంగ్రెస్​ పటాన్​చెరు అభ్యర్థిగా హై కమాండ్​ నీలం మధును ఖరారు చేసిన సంగతి తెలిసిందే. మంగళవారం మధు ఢిల్లీ నుంచి పటాన్​చెరు తిరిగి రావడంతో ఆయన అభిమానులు, ఎన్ఎంఆర్​ యువసేన సభ్యులు ముత్తంగి రింగ్​రోడ్డు వద్ద ఆయనకు ఘన స్వాగతం పలికారు.

అనంతరం ముత్తంగి నుంచి రుద్రారంలోని గణేశ్​గడ్డ గణపతి ఆలయం వరకు బైక్​ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మధు గణపతి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి నామినేషన్​ పత్రాలపై సంతకం చేశారు. ఆయన తరపున ఆయన సతీమణి కవిత నామినేషన్​ పత్రాలను ఎన్నికల అధికారులకు సమర్పించారు.