బీఆర్ఎస్​లో చేరిన మాజీ ఎమ్మెల్యే శశిధర్​రెడ్డి

బీఆర్ఎస్​లో చేరిన మాజీ ఎమ్మెల్యే శశిధర్​రెడ్డి

మెదక్​, పాపన్నపేట, వెలుగు: కాంగ్రెస్​ పార్టీకి చెందిన మెదక్ మాజీ ఎమ్మెల్యే పట్లోళ్ల శశిధర్​ రెడ్డి బీఆర్‌‌ఎస్‌లో​చేరారు. శుక్రవారం యూసుఫ్​ పేటలోని ఆయన ఇంటి వద్ద ఆర్థిక శాఖ మంత్రి హరీశ్​ రావు గులాబీ కండువా కప్పి శశిధర్​రెడ్డిని పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం మెదక్ పట్టణంలో డీసీసీ అధికార ప్రతినిధి, మెదక్ మున్సిపల్​ కౌన్సిలర్​ మామిళ్ల ఆంజనేయులు ఇంటికి వెళ్లిన ఆయనకు గులాబీ కండువా కప్పి బీఆర్​ఎస్​ పార్టీలో చేర్చుకున్నారు. 

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తిరుపతిరెడ్డి, శశిధర్​రెడ్డి, ఆంజనేయులు చేరికతో నియోజకవర్గంలో బీఆర్​ఎస్​ మరింత బలోపేతం అయిందని, ఇక పద్మా దేవేందర్​రెడ్డి విజయం ఖాయమైందని ధీమా వ్యక్తం చేశారు. పార్టీలో చేరిన మాజీ ఎమ్మెల్యే శశిధర్​ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్​ హైకమాండ్​కు చెవులే కాని, కళ్లులేవని విమర్శించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే పద్మా దేవేందర్, ఇఫ్కో డైరెక్టర్​ దేవేందర్​రెడ్డి, నియోజకవర్గ ఎన్నికల ఇన్​చార్జి కంఠారెడ్డి తిరుపతిరెడ్డి, పాపన్నపేట వైస్ ఎంపీపీ విష్ణువర్ధన్​రెడ్డి, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు సోములు, ఏడుపాయల చైర్మెన్​ బాలాగౌడ్​, గడీల శ్రీనివాస్ రెడ్డి, మెదక్ మున్సిపల్​ చైర్మెన్​ చంద్రపాల్​, వైస్​ చైర్మెన్​ మల్లికార్జున్​ గౌడ్​, ఏఎంసీ చైర్మెన్​ జగపతి పాల్గొన్నారు.