కొత్తగూడెం జీజీహెచ్​లో సమస్యలపై పేషెంట్ల ఆగ్రహం

కొత్తగూడెం జీజీహెచ్​లో సమస్యలపై పేషెంట్ల ఆగ్రహం

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : కొత్తగూడెంలోని జిల్లా గవర్నమెంట్​ జనరల్​ హాస్పిటల్​లో సమస్యలపై సోమవారం పేషెంట్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం హాస్పిటల్​కు పర్యటనకు వెళ్లిన కలెక్టర్​ జితేశ్ ​వి పాటిల్​ను రోగులు నిలదీశారు. హాస్పిటల్​లో పేషెంట్లను డాక్టర్లు పట్టించుకోవడం లేదని కలెక్టర్​ దృష్టికి తెచ్చారు.

 జ్వరంతో నాలుగు రోజులుగా హాస్పిటల్​కు వస్తున్నా సరైనా వైద్యం అందించడం లేదని వాపోయారు. ఇక్కడ సౌకర్యాలు ఏవీ లేక, ప్రైవేట్​ హాస్పిటళ్లకు వెళ్లలేక ఇబ్బంది పడుతున్నామని కన్నీళ్లు పెట్టుకున్నారు. దీనికి స్పందించిన కలెక్టరశ్రీ వెంటనే సరిపోను మందులు తెప్పించి రోగులకు మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను ఆదేశించారు. ఎక్స్​రే రూమ్​ రిపేర్లకు అవసరమైన ఎస్టిమేషన్లను తయారు చేసి తనకు అందజేయాలన్నారు. ఆయన వెంట మెడికల్​ కాలేజ్​ ప్రిన్సిపాల్​ రాజ్​కుమార్​తో పాటు పలువురు డాక్టర్లు ఉన్నారు.