బెంగళూరు మార్కెట్లోకి పౌలోమి

బెంగళూరు మార్కెట్లోకి పౌలోమి

హైదరాబాద్, వెలుగు:  తాము బెంగళూరు మార్కెట్లోకి ప్రవేశించినట్టు హైదరాబాద్ ​రియల్టీ కంపెనీ పౌలోమి ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రకటించింది. తనిసంద్రలో మాన్యత ఇంటిగ్రేటెడ్ టౌన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షిప్​ నిర్మిస్తున్నట్టు ప్రకటించింది.  కంపెనీ రూ. 800 కోట్ల పెట్టుబడితో 35-అంతస్తుల విలాసవంతమైన నివాస సముదాయాన్ని నాలుగు టవర్లతో అభివృద్ధి చేస్తోంది. 

ఈ ఎత్తైన నివాస ప్రాజెక్ట్ తొమ్మిది ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉంటుంది. 18 లక్షల చదరపు అడుగుల్లో విస్తీర్ణంతో ఫేజ్-1,  ఫేజ్-2లో రెండు టవర్లను నిర్మిస్తుంది. మొదటి దశ ఈ ఏడాది చివరి నాటికి ప్రారంభమవుతుంది. 35 అంతస్తుల్లో మొత్తం 850 భవనాలు ఉంటాయి.