పవన్ కళ్యాణ్ ప్రజలను రెచ్చగొడుతున్నారు: పేర్నినాని

పవన్ కళ్యాణ్ ప్రజలను రెచ్చగొడుతున్నారు: పేర్నినాని

వారాహి యాత్ర పేరుతో పవన్ కళ్యాణ్ కు నోటికొచ్చినట్లు  మాట్లాడి, ప్రజలను రెచ్చగొట్టడం చేస్తున్నారని ఎమ్మెల్యే, మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. సీఎం జగన్ మీద బురద వేయటం, చంద్రబాబుకు మేలు జరగాలని చూడటం పవన్ కళ్యాణ్ కు బాగా అలవాటైపోయిందని.. రాజకీయాల్లో ఇంతకన్నా తప్పుడు తనం ఉంటుందా అని ప్రశ్నించారు. 2000లో చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలోనే జై తెలంగాణ నినాదం మొదలయ్యింది. 2001లో టిఆర్ఎస్ ఆవిర్భవించింది. కేసీఆర్ పార్టీ పెట్టి జై తెలంగాణ నినాదంతో ఉద్యమాన్ని మొదలుపెట్టారు. స్వర్గీయ రాజశేఖరరెడ్డి 2004లో ముఖ్యమంత్రి అయితే.. దానికీ జగన్ కి ఏమిటి సంబంధం...? అని ప్రశ్నించారు జనం నవ్వుకుంటున్నారన్న కనీస ఆలోచన కూడా లేకుండా పచ్చి అబద్ధాలు పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారన్నారు.. 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ తో జత కలిసే టీఆర్ఎస్ ఎన్నికల్లో పోటీ చేసిందని అన్నారు. రాష్ట్ర విభజన గురించి పవన్ తప్పుడు మాటలు మాట్లాడుతున్నాడని.. వైఎస్ రాజశేఖరెడ్డి వల్లే విభజన జరిగినట్టు మాట్లాడటం విడ్డూరమన్నారు. 

ALSO READ :పాకిస్థాన్ లో మగాళ్లు వేస్ట్.. ఆడోళ్లకే కుటుంబాలపై బాధ్యత : కొత్త కామెంట్లపై రచ్చ రచ్చ

 పవన్ కళ్యాణ్  ఎన్నికల దాకా ముసుగు వేసుకుని.. అప్పుడు కలిసి పోటీ చేయడం.. ఎవరికి తెలియని విద్యలు ఇవన్నీ..? అని పేర్ని నాని  అన్నారు. మీ స్కీమ్ ఏంటంటే.. 30 చోట్ల చంద్రబాబు నియోజకవర్గాలకు ఇన్ ఛార్జీలను పెట్టడు. నీవేమో అక్కడ అభ్యర్థులను ప్రకటిస్తావు. ఆ నియోజకవర్గాలకు వెళ్ళి, ప్రభుత్వంపైన, మాపైన విషం చిమ్ముతావన్నారు. పవన్ కళ్యాణ్ 25-30 సీట్ల కంటే ఎక్కువ చోట్ల పోటీచేయడని అందరికీ తెలుసన్నారు. నిజాయితీ ఉంటే.. 2014 -19 మధ్య నువ్వు , చంద్రబాబు కలిసి చేసిన పాలనలో మీరు ఏం చేశారో.. మళ్ళీ అదే పరిపాలనను తెస్తాం అని చెప్పే దమ్ముందా..? మీకు దమ్ముంటే.. ఆ మాట చెప్పండి. ఆ మాట చెప్పి జనం దగ్గరకు వెళ్ళండని సవాల్ విసిరారు.