
రాష్ట్ర ఎన్నికల సంఘం పనితీరు, ప్రభుత్వానికి కొమ్ముకాసేలా ఉందని విమర్శించారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. లోకల్ బాడీ ఎలక్షన్ కు నామినేషన్ల సమయంలో చాలా చోట్ల దాడులు జరిగాయన్నారు. హింస, దౌర్జన్యాలపై నివేదికలు తయారు చేస్తున్నామన్నారు. తప్పులు చేసిన అధికారులపై కేంద్రానికి ఫిర్యాదు చేస్తామన్నారు.