న్యూఢిల్లీ: పేటీఎం పేరెంట్కంపెనీ వన్97 కమ్యూనికేషన్స్కు జూన్ క్వార్టర్లో నష్టం రూ. 840 కోట్లకు పెరిగింది. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్పై ఆంక్షల ప్రభావం ఇందుకు ప్రధాన కారణమని ప్రకటించింది. కంపెనీ రెగ్యులేటరీ ఫైలింగ్ ప్రకారం, ఏడాది క్రితం ఇదే కాలంలో కంపెనీ రూ.358.4 కోట్ల నష్టాన్ని చవిచూసింది. తాజా క్వార్టర్లో పేటీఎం కన్సాలిడేటెడ్ ఆదాయం 33.48 శాతం క్షీణించి రూ. 1,639.1 కోట్లకు పడిపోయింది.
క్రితం సంవత్సరం ఇదే కాలంలో రూ. 2,464.2 కోట్లుగా ఉంది. ఉల్లంఘనల కారణంగా మార్చి 15 నుంచి కస్టమర్ ఖాతాలు, వాలెట్లు, ఫాస్ట్ట్యాగ్లలో డిపాజిట్లు, క్రెడిట్ లావాదేవీలు లేదా టాప్-అప్లను అంగీకరించకుండా పీపీబీఎల్ను ఆర్బీఐ నిషేధించింది. కొన్ని ఉత్పత్తులను కూడా కంపెనీ తాత్కాలికంగా నిలిపివేసింది.
పేటీఎం జీఎంవీ క్వార్టర్ ఆన్ క్వార్టర్ ప్రాతిపదికన రూ.4.69 లక్షల కోట్ల నుంచి 9.1 శాతం క్షీణించింది. అయితే వార్షిక ప్రాతిపదికన రూ. 4.3 లక్షల కోట్ల జీఎంవీని సాధించింది.