తిరుమలకు పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్

తిరుమలకు పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్

హైదరాబాద్, వెలుగు: పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి సోమవారం రాత్రి తిరుపతికి చేరుకున్నారు. ఈ సందర్భంగా రేణిగుంట విమానాశ్రయంలో ఆయనకు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. 

ఆయన రాత్రి తిరుమలలో బస చేసి, మంగళవారం తెల్లవారుజామున వెంకటేశ్వరస్వామిని దర్శించుకుని మధ్యాహ్నం లోపు తిరిగి హైదరాబాద్ కు చేరుకోనున్నారు.