22న కాంగ్రెస్ నిరసన ర్యాలీ

22న కాంగ్రెస్ నిరసన ర్యాలీ
  • పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్ వెల్లడి

హైదరాబాద్, వెలుగు: ఈ నెల 22 న పీసీసీ ఆధ్వర్యంలో హైదరాబాద్​లో నిరసన చేపట్టనున్నామని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్ వెల్లడించారు. సోమవారం గాంధీ భవన్​లో ఆయన మీడియాతో మాట్లాడారు. అదానీ కుంభకోణాలపై కేంద్రం జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయకపోవడాన్ని నిరసిస్తూ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నిరసనకు పిలుపునిచ్చిందని, అందులో భాగంగా హైదరాబాద్​లో కాంగ్రెస్ నిరసన ర్యాలీ చేపట్టనుందని తెలిపారు.

అసెంబ్లీ ఎదురుగా ఉన్న అమరవీరుల స్తూపం నుంచి ఈడీ కార్యాలయందాకా ర్యాలీ నిర్వహిస్తామని చెప్పారు. ఇందులో సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు,  ఎమ్మెల్సీలు పాల్గొంటారని చెప్పారు. పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొని నిరసన ర్యాలీని విజయవంతం చేయాలని ఆయన కోరారు.