
జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ జనవరి 11న మధ్యాహ్నం ఆమె ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఆమె తృటిలో తప్పించుకున్నారు. పలు నివేదికల ప్రకారం, ఈ సంఘటన జమ్ము కశ్మీర్ లోని అనంతనాగ్ జిల్లాలో జరిగింది. ప్రమాదం తాకిడికి నల్లటి స్కార్పియో బానెట్ మెలికలు తిరిగింది. ఈ రోజు అనంత్నాగ్లో ముఫ్తీ కారు ఘోర ప్రమాదానికి గురైందని, దేవుడి దయ వల్ల ఆమె, ఆమె భద్రతా అధికారులు ఎలాంటి గాయాలు లేకుండా సురక్షితంగా బయటపడ్డారని పీడీపీ నేత కుమార్తె ఇల్తిజా Xలో చెప్పారు.
Ms Mufti’s car met with a terrible accident enroute Anantnag today . Thanks to the grace of god she & her security officers escaped unhurt without any serious injuries.
— Iltija Mufti (@IltijaMufti_) January 11, 2024
ఈ సందర్భంగా స్పందించిన మాజీ జమ్ము కశ్మీర్ మంత్రి ఒమర్ అబ్దుల్లా.. మెహబూబా ముఫ్తీ సాహిబా ప్రమాదం జరిగిన ఘటనలో గాయాల నుండి తప్పించుకున్నందుకు సంతోషిస్తున్నామన్నారు. ప్రమాద పరిస్థితులను ప్రభుత్వం విచారిస్తుందని ఆశిస్తున్నానని చెప్పారు.
సంగం వద్ద మఫ్తీ వాహనం.. ఓ కారును ఢీకొట్టిందని ఒక పోలీసు అధికారి తెలిపారు. అగ్ని ప్రమాదంలో బాధితులను పరామర్శించేందుకు ఖానాబాల్కు వెళ్లిన పీడీపీ చీఫ్కు ఎలాంటి గాయాలు కాలేదని చెప్పారు. అయితే, ఆమె వ్యక్తిగత భద్రతలో ఉన్న ఒక పోలీసు అధికారికి మాత్రం స్వల్ప గాయాలయ్యాయని తెలిపారు.
Glad to hear that @MehboobaMufti Sahiba escaped injury in what could have been a very serious incident. I expect the government to enquire in to the circumstances of the accident. Any gaps in her security that contributed to this accident must be addressed immediately. https://t.co/ELXb2sHhNt
— Omar Abdullah (@OmarAbdullah) January 11, 2024