సెప్టెంబర్ 30న పీడీఎస్​యూ 50 ఏండ్ల సభ

సెప్టెంబర్  30న పీడీఎస్​యూ 50 ఏండ్ల సభ

ఖమ్మం టౌన్, వెలుగు: మహిళల రక్షణే పీడీఎస్​యూ లక్ష్యం అని సంఘం రాష్ట్ర మాజీ కన్వీనర్ లక్ష్మి, జిల్లా కార్యదర్శి వెంకటేశ్ అన్నారు. సోమవారం సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నగరంలోని ఎస్సీ గర్ల్స్ హాస్టల్ లో నిర్వహించిన పీడీఎస్ యూ స్వర్ణోత్సవ సభలో వారు మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా మహిళలపై జరుగుతున్న దాడులకు, వివక్షతకు వ్యతిరేకంగా పోరాడిన నాయకుడు కామ్రేడ్ జార్జ్ రెడ్డి అని అన్నారు.

ఈ నెల 30న ఉస్మానియా యూనివర్సిటీ ఠాగూర్ ఆడిటోరియంలో ప్రస్తుత, పూర్వ పీడీఎస్ యూ నాయకులతో  50 ఏండ్ల వార్షికోత్సవ సభ నిర్వహించనున్నామని, ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పీడీఎస్ యూ మాజీ జిల్లా నాయకురాలు  మమత, నగర నాయకులు యశ్వంత్, అనూష, స్పందన, అలేఖ్య, శైలజ తదితరులు పాల్గొన్నారు.