పెండింగ్​ డిగ్రీ ఫలితాలు విడుదల చేయాలి

 పెండింగ్​ డిగ్రీ ఫలితాలు విడుదల చేయాలి
  • పీడీఎస్ యూ నాయకులు 

హనుమకొండ, వెలుగు: కేయూ పరిధిలో పెండింగ్​లో పెట్టిన 117​  ప్రైవేట్ డిగ్రీ  కాలేజీల ఫలితాలను వెంటనే విడుదల చేయాలని పీడీఎస్​యూ కాకతీయ యూనివర్సిటీ అధ్యక్షుడు బి.బాలకృష్ణ, ప్రధాన కార్యదర్శి వి.కావ్య డిమాండ్​ చేశారు. గురువారం యూనివర్సిటీ వీసీ బిల్డింగ్ ఎదుట గురువారం ధర్నాకు దిగారు.  

వీసీ ప్రతాపరెడ్డికి వినతిపత్రం అందించారు.  యూనివర్సిటీకి  బకాయిలు చెల్లించకపోవడం వల్లే ఫలితాలు నిలిపివేశామని అధికారులు చెప్పడం దారుణమన్నారు.  విద్యార్థులు ఆందోళన చెందుతున్నారని, ఫలితాలు రిలీజ్​ చేయాలని కోరారు. లేనిపక్షంలో పీడీఎస్​యూ ఆధ్వర్యంలో  ఉద్యమిస్తామని పేర్కొన్నారు.  సంఘం ఉపాధ్యక్షులు గణేశ్, శ్రీచందన, సహాయ కార్యదర్శులు యాదగిరి నాయకులు పాల్గొన్నారు.