
సిద్దిపేట రూరల్, వెలుగు: సిద్దిపేట జిల్లా కేంద్రంలో యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని పీడీఎస్యూ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం రాష్ట్రంలో నెలకొన్న విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని పట్టణంలోని డిగ్రీ, పీజీ కాలేజ్ఆడిటోరియంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పీడీఎస్ యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్, టీపీటీఫ్, డీటీఫ్ సీనియర్ నాయకులు తిరుపతిరెడ్డి, సత్తయ్య మాట్లాడుతూ రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్స్, హాస్టల్ మెస్ ఛార్జీలు విడుదల చేయాలని కోరారు.
ప్రజా సంఘం నాయకుడు జాన్ వెస్లీ, ఏఐపీఎస్ యూ రాష్ట్ర అధ్యక్షుడు కుమార్, న్యాయవాది బైరి ప్రవీణ్ మాట్లాడుతూ సిద్దిపేట అగ్రికల్చర్ కాలేజీని వేరే ప్రాంతానికి తరలించే ఆలోచనను విరమించుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పీడీఎస్యూ ఇంజనీరింగ్ వింగ్ కన్వీనర్ వెంకట్, న్యాయవాదులు విజయ్ కుమార్, శివ, గర్ల్స్ కన్వీనర్ రేణుక, అక్షిత పాల్గొన్నారు.