
పెబ్బేరు, వెలుగు: యూపీలోని లక్నోలో అండర్–15 టీ-10 నేషనల్ క్రికెట్ టోర్నీలో విజేతలుగా నిలిచిన వనపర్తి జిల్లా పెబ్బేరు టీమ్ ఆదివారం పట్టణంలో సంబురాలు చేసుకుంది. కప్, జాతీయ జెండాలతో పట్టణంలో ఓపెన్ టాప్ జీప్లో ర్యాలీ చేశారు. ఒకరికొకరు స్వీట్స్ తినిపించుకొని, పటాకులు కాల్చారు. పేరెంట్స్, పట్టణ ప్రముఖులు, ప్రజలు వారిని పూలమాలతో సత్కరించి అభినందనలు తెలిపారు. టీమ్ కెప్టెన్ చరణ్, ప్లేయర్స్ సాక్షిక్, మహేశ్, భీష్మంత్, చందు, పరశురాముడు, అఫ్రోజ్, యోగేశ్వర్, ఫర్హాన్ రేహాన్, గణేశ్, కోచ్ శంకర్, మనోహర్ పాల్గొన్నారు.