లంచం తీసుకుంటూ.. ఏసీబీకి పట్టుబడ్డ పెబ్బేరు కమిషనర్ ఆదిశేషు

లంచం తీసుకుంటూ.. ఏసీబీకి పట్టుబడ్డ పెబ్బేరు కమిషనర్ ఆదిశేషు

హైదరాబాద్ లో మరో అవినీతి చేప ఏసీబీ అధికారుల వలకు చిక్కింది. లంచం తీసుకుంటూ వనపర్తి జిల్లా పెబ్బేరు మున్సిపల్ కమిషనర్ ఏసీబీ అధికారులకు చిక్కా రు. బాధితుడినుంచి రూ. 20 వేలు లంచం తీసుకుంటుండగా పెబ్బేరు మున్సిపల్ కమిషనర్ ఆదిశేషును రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు ఏసీబీ అధికారులు. 
మంగళవారం ( అక్టోబర్ 22) పక్కా సమాచారంతో వనస్థలిపురం పరిధిలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు.  తుర్కయంజాల్ మున్సిపాలిటీలోని కమ్మగూడ రాజరజిత హోమ్స్ లో ఆదిశేషు ఇంట్లో తనిఖీలు చేశారు. ఈ క్రమంలో ఓ వ్యక్తి నుంచి రూ. 20వేలు లంచం తీసుకుంటుండగా ఆదిశేషును ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.  మహబూబ్ నగర్ ఏసీబీ డీఎస్పీ శ్రీకృష్ణగౌడ్ ఆధ్వర్యంలో ఈ సోదాలు చేశారు.  

ALSO READ | రంగారెడ్డి జిల్లా అడిషనల్ కలెక్టర్ ఇంట్లో ఏసీబీ సోదాలు.. రూ 5 కోట్ల అక్రమాస్తులు గుర్తింపు