
దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. తెలంగాణలో 17 స్థానాలకుగానూ కాంగ్రెస్ 7 స్థానాలలో లీడింగ్ లో కొనసాగుతుంది. పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇక్కడి నుంచి బీఆర్ఎస్ తరుపున మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, బీజేపీ నుంచి గోమాస శ్రీనివాస్ బరిలో ఉన్నారు. ఇక జహీరాబాద్, నాగర్ కర్నూల్, ఖమ్మం. వరంగల్ లో లీడింగ్ లో కొనసాగుతుంది. అటు బీజేపీ 8 స్థానాల్లో లీడింగ్ లో కొనసాగుతుంది. బీఆర్ఎస్ ఒక్కస్థానంలో కూడా లీడింగ్ లో లేదు.