
జ్యోతినగర్, వెలుగు: ఆన్లైన్ పార్ట్టైమ్ జాబ్ పేరుతో సైబర్నేరగాళ్లు పెద్దపల్లి జిల్లాకు చెందిన యువకుడి నుంచి దాదాపు రూ.16 లక్షలు కొట్టేశారు. ఎస్సై జీవన్ తెలిపిన వివరాల ప్రకారం.. రామగుండం ఎన్టీపీసీ పర్మినెంట్ టౌన్ షిప్ కు చెందిన ఎం.అవినాశ్ఆన్లైన్పార్ట్టైమ్జాబ్కోసం టెలిగ్రామ్యాప్ లో సెర్చ్ చేస్తుండగా ఓ లింక్వచ్చింది. అందులో తన వివరాలు నమోదు చేశాడు.
తర్వాత ఆన్లైన్లో ఇచ్చిన టాస్క్ కంప్లీట్చేస్తే కమీషన్ వస్తుందని మెసేజ్రావడంతో నమ్మాడు. అలా సైబర్నేరగాళ్లు అడిన అకౌంట్కు రూ.15లక్షల80 వేలు ట్రాన్స్ఫర్చేశాడు. రోజులు గడుస్తున్నా.. తనకు కమీషన్రాకపోవడంతో మోసపోయానని తెలుసుకుని, మంగళవారం ఎన్టీపీసీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.